కేవలం శాఖాహారమే దైవసాక్షాత్కృతిని కల్పిస్తే
పశువూ పక్షీ మనిషి కంటే శ్రేష్ఠం
నిత్యస్నానమే దైవ దర్శనానికి మార్గమైతే
చేప కంటే ధన్యజీవి ఎవరు ?కేవలం ఆకూ అలమూ దైవ సాన్నిధ్యం కల్పిస్తే
మేకలూ లేళ్ళూ దైవాన్ని చూడాలి
భార్యనూ, సంసారాన్ని రోసినవాడే దైవాన్ని చూస్తే
నపుంసకుల కంటే అదృష్టవంతులు లేరు
ప్రేమే దేవాలయ ద్వారమంటున్నది మీరా– మీరాబాయి